Home  »  TV News  »  అనుపమ‌ గురించి ఎంక్వైరీ చేయమన్న దేవయాని!

Updated : Nov 1, 2023

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ గుప్పెడంత మనసు. ఈ సీరియల్ సోమవారం నాటి ఎపిసోడ్ -908 లో.. ఒకదాని తర్వాత ఒకటి ఎటాక్స్ జరుగుతున్నాయని, వెంటనే వెళ్ళిపోండని అనుపమ అనగానే.. మహేంద్ర సరేనంటాడు. రిషి, వసుధారలని అడుగగా.. అడుగడుగున ఇంత ప్రమాదం పొంచి ఉంటే ఎందుకు ఇక్కడ ఉండటం, మీరు ప్రశాంతంగా ఉండాలని తీసుకొచ్చామని వసుధార అంటుంది. ఇంతకీ మీ పేరు చెప్పలేదని వసుధార అడుగుగా.. అనుపమ అని అంటుంది. అది విని వసుధార, రిషి ఇద్దరు ఆశ్చర్యపోతారు. ఆ తర్వాత అరకు నుండి ఇంటికి వచ్చేస్తారు.

ఇంటికి రాగానే అరకులో తనపై ఎటాక్ చేసిందెవరని ఆలోచిస్తుంటాడు రిషి. ఎందుకు మనల్ని ఇలా ప్రమాదాలు జరుగుతున్నాయని రిషి అనగా.. ఎవరో మన చుట్టూ ఉండి ఇది చేస్తున్నారని వసుధార అంటుంది. ఎటాక్ జరిగిన రెండుసార్లు అనుపమ కాపాడిందని రిషి అంటాడు.

అసలు తను ఎవరని రిషిని వసుధార అడుగుతుంది. మనకి కావాల్సిన శ్రేయోభిలాషిలా ఉందని రిషి అనగా.. అవును సర్, అరకులో ఒక రాయి మీద జగతి, అనుపమ, మహేంద్ర అని రాసి ఉందని వసుధార అంటుంది. మరి నాకెందుకు చెప్పలేదని అనగా.. మహేంద్ర సర్ ని రెసార్ట్ దగ్గర డ్రాప్ చేసిందని వసుధార అనగానే.. నాన్న రిషీ అంటూ మహేంద్ర వస్తాడు. ఇక రిషి, వసుధార ఇద్దరు మహేంద్ర విన్నాడేమోనని టెన్షన్ పడతారు. నీ మీద ఎటాక్ చేసినవాళ్ళని పట్టుకోవాలని, జగతిని చంపినవారికి, వీళ్ళకి మధ్య ఏమైన సంబంధం ఉందా కనుక్కోవాలని రిషితో మహేంద్ర చెప్పేసి వెళ్తాడు. ఇక మరొకవైపు శైలేంద్ర, దేవయాని మాట్లాడుకుంటారు.

నా ఆలోచనలు,‌నా ఆశయాలన్నీ ఆ ఎండీ సీట్ కోసమే అని శైలేంద్ర అనగానే.. అది జరగదని దేవయాని అంటుంది. అదేంటమ్మా అలా అంటున్నావని శైలేంద్ర అంటాడు. వాళ్ళు అరకు వెళ్లి మళ్ళీ వచ్చారు. మనం మాత్రం ఏం చేయలేదని దేవయాని అంటుంది. ఎండీ సీట్ దక్కించుకోవడం నీ వల్ల కాదు. ఫారెన్ వెళ్లిపోమని దేవయాని అంటుంది. నీ ఆలోచనలు కీ రీల్ ప్లే చేస్తాయని శైలేంద్ర అంటాడు‌. చివరికి జగతి ప్రాణం పోయిన, ఫలితం మనకి దక్కట్లేదని దేవయాని అనగా.. నువ్వే చెప్పావ్ కదా అమ్మ, సహనంగా ఉండాలి, గట్టి నమ్మకంగా ఉండాలని శైలేంద్ర అంటాడు. ఇక బ్యాలెన్స్ గా కొన్ని ప్రాణాలు ఉన్నాయి. ఇక అవి కూడా పోయాయనుకో అని శైలేంద్రతో దేవయాని అనగానే.. దేవయాని అంటూ పణీంద్ర వస్తాడు. " ఎవరి ప్రాణాల గురించి? చెప్పు దేవయాని? అసలేం జరుగుతుంది శైలేంద్ర? మీ మాటలు వింటుంటే నాకు భయమేస్తుంది" అని ఫణీంద్ర నిలదీస్తాడు. ఇక అప్పుడే నేను చెప్తాను మామయ్య గారు అని ధరణి వస్తుంది. తన ప్రాణాలు ఎవరు తీసారో ఏంటో వాళ్ళు దొరికితే బాగుండు. ఎలాగైనా వాళ్లని దొరకబట్టి తగిన శిక్ష వేయాలని మాట్లాడుకుంటుమ్నారని ధరణి అంటుంది. అవునా అని ఫణింద్ర అనగానే.. అవును తల్చుకొని బాధపడుతున్నాని దేవయాని అంటుంది. ఇక నీ నాటకాలు ఆపుతావా? జగతిని తల్చుకోకని దేవయానితో ఫణీంద్ర అంటాడు. ఈ తల్లికొడుకులు ఒకరితో ఒకరు మాట్లాడుకోకూడదని ధరణితో ఫణీంద్ర అంటాడు.  అనుపమ గురించి ఎంక్వైరీ చేయమని శైలేంద్రతో చెప్తుంది దేవయాని.

 






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.